విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడి కారు చోరీ
ABN , First Publish Date - 2021-05-10T16:43:44+05:30 IST
విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడి కారు చోరీకి గురైంది.
హైదరాబాద్/బంజారాహిల్స్ : విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడి కారు చోరీకి గురైంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 10 పంచవటి ఐఏఎస్ సొసైటీలో నివసించే విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.వెంకటశివయ్య కుమారుడు కనుమలూరి శ్రీహర్ష ఓ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఆయన ఈ నెల 8న తన నిసాన్ సన్ని కారులో రోడ్డు నెంబరు 10లోని మెడ్ప్లస్ మెడికల్ స్టోర్కు వెళ్లారు. కారు బయట ఉంచి మందులు కొనుగోలు చేసి తిరిగి వచ్చే సరికి కారు కనిపించలేదు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించిన పోలీసులు కారు చోరీ జరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.