కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టండి: ముద్రగడ

ABN , First Publish Date - 2022-01-26T22:46:45+05:30 IST

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జిల్లాలో ఏర్పాటు

కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టండి: ముద్రగడ

తూర్పుగోదావరి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు బాలయోగి పేరు పెట్టాలని సీఎం జగన్‌రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిసిందని ఆయన పేర్కొన్నారు. తూర్పు లేదా పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డా.అంబేద్కర్ పేరు పెట్టాలని ఆయన కోరారు. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని ముద్రగడ విజ్ఞప్తి చేశారు. 


అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను చేర్చారు. రామచంద్రాపురం, మండపేట, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, ముమ్మడివరం నియోజకవర్గాలు ఉన్నాయి. అమలాపురం, రామచంద్రాపురం అనే రెండు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. దాదాపు 24 మండలాలు ఉండనున్నాయి. 


Updated Date - 2022-01-26T22:46:45+05:30 IST