అక్రమ కేసులు పెడితే సహించేది లేదు..

ABN , First Publish Date - 2022-01-17T05:04:29+05:30 IST

టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

అక్రమ కేసులు పెడితే సహించేది లేదు..
మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

మాజీ మంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట, జనవరి 16: టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్టును ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవిందబాబుపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడం హేయమైన చర్య అని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గం జొన్నలగడ్డ గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహం మాయమైపోయిన ఘటనలో అమాయకులైన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే అసలైన దోషులను పట్టుకోవాలన్నారు. కక్షపూరితంగా టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదన్నారు. అరెస్టుచేసిన వారిని  తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో న్యాయస్థానం ద్వారా తగిన గుణపాఠం చెబుతామని ప్రత్తిపాటి హెచ్చరించారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నారు.

   

Updated Date - 2022-01-17T05:04:29+05:30 IST