తక్షణమే రైతులను ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

ABN , First Publish Date - 2021-11-17T23:16:22+05:30 IST

ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మండపాక , దువ్వ తదితర గ్రామాల్లో స్వర్ణ పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు

తక్షణమే రైతులను ఆదుకోవాలి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు: ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మండపాక , దువ్వ తదితర గ్రామాల్లో స్వర్ణ పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు మండపాక గ్రామంల్లో వర్షాలకు డెబ్భతిన్న పొలాలను పరిశీలించటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ధాన్యం మాయూశ్చార్  16 % శాతం కంటే ఎక్కువ ఉంటే కానీ ధాన్యాం కొనుకోలు చేయమని ప్రభుత్వం చెప్తుందని డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా అండగా వుండేటువంటి ధాన్యం కొనుకోలు కేంద్రాలను కూడా మూసివేసి  RBK కేంద్రాలద్వారా ధాన్యాం కొనుగోలు చేస్తామని అదేకాకుండా ధాన్యం పూర్తిగా డ్రైగా వుంటేనే కొనుగొలు చేస్తామని ప్రకటనలు ఇవ్వటం సరికాదన్నారు.


దాదాపు 700 ఎకరాలకు పైగా వరి చేలు అన్ని కూడా నీటమునిగి మొలకలు వచ్చి కనీసం  కోతలుకోసేటువంటి పరిస్థితి కూడా లేదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రైతులకు తక్షణమే న్యాయం చేసేవిధంగా చూడాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్మకురి రామకృష్ణ ,మారం కోటేశ్వరరావు , ముళ్ళపూడి శివ , నౌడు శ్రీను , రైతు సంగం సెక్రటరీ పాలకుర్తి సత్యనారాయణ, రైతులు బాలుసు వీరవెంకట సత్యనారాయణ , సబ్బు కృష్ణ , ఆలపాటి నాగేశ్వరరావు , కారుటురి కృష్ణ , ఆత్మకురి సూరిబాబు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-17T23:16:22+05:30 IST