రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా...?

ABN , First Publish Date - 2021-10-20T05:42:25+05:30 IST

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అంటూ టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా...?
జీవీ ఆంజనేయులు

జీవీ ఆంజనేయులు

గుంటూరు, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అంటూ టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ  అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం ఆయన ఆనలైనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. పక్కా ప్రణాళికతోనే పార్టీ కేంద్ర కార్యాలయం, నేతల ఇళ్లపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షం ఎత్తిచూపటం, విమర్శిలు చేయటం సహజం అని అయితే దాడులకు దిగుతారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ జాతీయ కార్యాలయంపై  దాడికి దిగిన వారిని నడిరోడ్డుపైన ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఈ దాడులకు సీఎం, డీజీపీ బాధ్యత వహించాలని తెలిపారు. డీజీపీ ప్రోద్బలంతోనే ఇదంతా జరగుతోందని తెలిపారు. సిగ్గుతో ఈ ఘటనకు బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలని జీవీ డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-10-20T05:42:25+05:30 IST