మాజీ ఎమ్మెల్యేకు జైలు, జరిమానా
ABN , First Publish Date - 2021-08-13T00:19:46+05:30 IST
హైదరాబాద్: పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు 6నెలల జైలు, రూ.10 వేల జరిమానా విధించింది.
హైదరాబాద్: పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు 6నెలల జైలు, రూ.10 వేల జరిమానా విధించింది. గత ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. అశ్వాపురం పోలీస్ స్టేషన్లో 2018లో నమోదైన కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే రూ.10వేల జరిమానా చెల్లించారు. అప్పీలు వెళ్లేందుకు కోర్టు అనుమతిస్తూ శిక్ష నిలిపేసింది.