27న ఐటీడీఏ ముట్టడి

ABN , First Publish Date - 2020-10-25T07:11:29+05:30 IST

పందిరిమామిడి-కోట ప్రధాన రహదారిలో వంతె నలు పడగొట్టడంపై 45 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు.

27న ఐటీడీఏ ముట్టడి

  • మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

రంపచోడవరం, అక్టోబరు 24: పందిరిమామిడి-కోట ప్రధాన రహదారిలో వంతె నలు పడగొట్టడంపై 45 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. శనివారం ఆమె పార్టీ నాయకులతో తాటవాడ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణపు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి పునరుద్ధరణ పేరుతో ఒకేసారి ఐదు వంతెలను కూల్చివేయడంపై ఈనెల 27న ఐటీడీఏని ముట్టడించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కె.శేషాయమ్మ, వై.నిరంజనీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T07:11:29+05:30 IST