నియంత పాలన మారితేనే తెలంగాణ అభివృద్ధి
ABN , First Publish Date - 2021-10-13T05:18:10+05:30 IST
నియంత పాలన మారితేనే తెలంగాణ అభివృద్ధి
కమలాపూర్, అక్టోబరు 12: రాష్ట్రంలో నియం త పాలన మారితేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అ న్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ తండ్రి కొడుకుల పార్టీ అయ్యిందన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వల్లనే దళిత బంధు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోతే సీఎం కేసీఆర్ ప్రభుత్వంలోనే ఉండేవారు కాదన్నారు. పార్టీలకు అతీతంగా చెవెళ్లకు చెందిన 20 ఉద్యమకారుల బృందాలు హుజూరాబాద్ వస్తాయన్నారు. ఇప్పటికే 13 బృందాలు వచ్చి సుమారు 70 గ్రామా ల్లో ఈటలకు అనుకూలంగా ప్రచారం చేసారన్నారు. ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని.. తన వ్యక్తిగతంగా ఈటల గెలువాలని హుజూరాబాద్కు వస్తున్నా నన్నారు. సమావేశంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యధర్శి ధరమ్ గురువారెడ్డి, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఈటల భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.