పీసీసీ రేసులో నేనూ ఉన్నా: మధుయాష్కీ

ABN , First Publish Date - 2021-06-07T20:42:55+05:30 IST

రాష్ట్ర పీసీసీ ( టీపీసీసీ) అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని

పీసీసీ రేసులో నేనూ ఉన్నా: మధుయాష్కీ

హైదరాబాద్: రాష్ట్ర పీసీసీ ( టీపీసీసీ) అధ్యక్షుడి రేసులో తాను కూడా ఉన్నానని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలోనే పీసీసీ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఢిల్లీలో మొదలైందని తెలిపారు. కానీ అందరూ ఊహించినట్టు అది ట్వంటీ ట్వంటీ స్థాయిలో లేదని ఆయన పేర్కొన్నారు. పీసీసీ పగ్గాలను బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలని కోరుతున్నామని ఆయన అన్నారు. 




ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి ఈటెల వెళుతున్నారని మధు ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆయన విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే బీజేపీ మీద కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - 2021-06-07T20:42:55+05:30 IST