జాతర ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2022-01-27T05:47:02+05:30 IST

పట్టణంలోని కాలేజీ రోడ్డు గోదావరి తీరంలో ఫిబ్రవరి 14,15 తేదీల్లో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను స్ధానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు బుధవారం పరిశీలించారు.

జాతర ఏర్పాట్ల పరిశీలన
జాతర ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

ఏసీసీ, జనవరి 26: పట్టణంలోని కాలేజీ రోడ్డు గోదావరి తీరంలో ఫిబ్రవరి 14,15 తేదీల్లో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను స్ధానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు బుధవారం పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముకేష్‌గౌడ్‌, కౌన్సిలర్లు సుంకరి శ్వేత, అనిత, విశ్వనాధ ఆలయ కమిటీ చైర్మన్‌ సిరిపురం శ్రీనివాస్‌, నాయకులు వెంకటేశ్వర్‌రావు, కిషన్‌, సుధీర్‌, మున్సిపల్‌ , దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారు.


Updated Date - 2022-01-27T05:47:02+05:30 IST