క్వారంటైన్‌ కేంద్రాల పరిశీలన

ABN , First Publish Date - 2020-04-05T09:17:13+05:30 IST

క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు.

క్వారంటైన్‌ కేంద్రాల పరిశీలన

గుంటూరు, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. శనివారం ఉదయం ఇన్నర్‌రింగురోడ్డులోని భాష్యం, చైతన్య విద్యా సంస్థల భవనాలను కలెక్టర్‌ పరిశీలించారు. ఆయా భవనాలలోని గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర వసతులను పరిశీలించారు. క్వారంటైన్‌ కేంద్రాలకు అనుగుణంగా బెడ్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, గుంటూరు తూర్పు తహసీల్దార్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T09:17:13+05:30 IST