వివాదాస్పద స్థలం పరిశీలన
ABN , First Publish Date - 2020-06-06T09:54:00+05:30 IST
తోకలవలస పంచాయతీ లచ్చన్నవలసలో అంబేడ్కర్ విగ్రహం ఏరాటుకు స్థానిక ఎస్సీ కులస్థులు గుర్తించిన స్థలం
రేగిడి, జూన్ 5: తోకలవలస పంచాయతీ లచ్చన్నవలసలో అంబేడ్కర్ విగ్రహం ఏరాటుకు స్థానిక ఎస్సీ కులస్థులు గుర్తించిన స్థలం వివాదాస్పదం కావడంతో శుక్రవారం పాలకొండ సీఐ ఆదాం, రేగిడి ఎస్ఐ బి.రేవతి పరిశీలించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు పూనుకుంటే స్థాని బీసీలు వివక్ష చూపి పనులను అడ్డుకుంటున్నారంటూ ఈనెల 4న స్ధానిక పోలీస్స్టేషన్కు ఆల్ఇండియా దళిత ఫెడరేషన్ అధ్యక్షుడు బత్తిన మోహన రావు తదితరులు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు సీఐ ఆ స్థలాన్ని పరిశీలించగా ఇరువర్గాలు తమ వాదనను వినిపించాయి. సమస్యను సామరస్యంగా ఆలో చించాలని, విగ్రహం ఏర్పాటుకు మూడుచోట్ల స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. గ్రామస్థులు, ఎస్సీ కులస్థుల సమష్టి నిరయం మేరకు విగ్రహం ఏర్పాటుకు సీఐ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ పరిశీనలో దళితసంఘ నాయకులు బత్తిన మోహనరావు, టి.మోహనరావు, జి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.