పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-10-23T05:01:10+05:30 IST
ఈ విద్యాసంవత్సరంలో పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను అవగాహన చేసుకుని పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్, మునిసిపల్ ఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణరావు అన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 22: ఈ విద్యాసంవత్సరంలో పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను అవగాహన చేసుకుని పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్, మునిసిపల్ ఆర్డీ ఎన్వీవీ సత్యనారాయణరావు అన్నారు. స్థానిక నగరపాలక సంస్థ నన్నయ హైస్కూల్లో తరగతి గదులను ఆయన పరిశీలించారు. ఫార్మేటివ్-1 పరీక్షల నిర్వహణపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో ఫార్మేటివ్ పరీక్ష ప్రశ్నపత్రాలు రాష్ట్ర స్థాయిలోనే తయారవుతున్నట్టు చెప్పారు. పరీక్షకు ఒక గంట ముందు ప్రశ్నపత్రాలు మండల విద్యాశాఖ అధికారుల ద్వారా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరుతాయని కార్పొరేషన్ స్కూల్స్ డీవైఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం ఆనంద్, ఉపాద్యాయులు వ్యాగ్రేశ్వరుడు పాల్గొన్నారు.