నిధుల మంజూరుపై హర్షం
ABN , First Publish Date - 2021-06-19T05:56:29+05:30 IST
ధర్మపురి శివారులో గల అక్కపెల్లి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్, పునరుద్ధరణ పనుల కోసం నిధులు మంజూరు చేయించినం దుకు వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, నాగారం రైతులు శుక్రవారం కరీంనగర్లో గల మినిష్టర్ క్యాంపు కార్యా లయానికి వెళ్లి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను శాలువా కప్పి సన్మా నించారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ను సన్మానిస్తున్న నాగారం రైతులు
ధర్మపురి, జూన్ 18: ధర్మపురి శివారులో గల అక్కపెల్లి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్, పునరుద్ధరణ పనుల కోసం నిధులు మంజూరు చేయించినం దుకు వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు, నాగారం రైతులు శుక్రవారం కరీంనగర్లో గల మినిష్టర్ క్యాంపు కార్యా లయానికి వెళ్లి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను శాలువా కప్పి సన్మా నించారు. నిధులు మంజూరుతో నాగారం రైతుల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఉపసర్పంచ్ సంతోష్కుమార్, టీఆర్ఎస్ గామ శాఖ అధ్యక్షులు రమేష్, రైతుబంధు అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.