హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయండి: స్వరూపానందేంద్ర సరస్వతి

ABN , First Publish Date - 2021-09-11T23:35:58+05:30 IST

విశాఖపట్నం: తిరుమలలో సాంప్రదాయ భోజనం పేరుతో శ్రీవారి ప్రసాద విక్రయం సరికాదని, విరమించుకోవాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములు సూచించారు.

హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయండి: స్వరూపానందేంద్ర సరస్వతి

విశాఖపట్నం:  టీటీడీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సూచించారు. టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జవహర్ రెడ్డి.. శనివారం రిషికేష్ వెళ్ళి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాములను కలిశారు. ఈ సందర్భంగా  టీటీడీ చేపట్టాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఈఓ జవహర్ రెడ్డికి.. స్వాములు పలు సూచనలు చేశారు.  స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలను కేంద్రంగా చేసుకుని టీటీడీ తరపున హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని చెప్పారు. గిరిజన, హరిజన ప్రాంతాల్లో భజన మండళ్లకు పూర్వవైభవం తీసుకురావాలని సూచించారు.


సాంప్రదాయ భోజన విక్రయాలను నిలిపేస్తూ నిర్ణయాన్ని ప్రకటించడంపై స్వరూపానందేంద్ర సరస్వతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఈవో జవహర్ రెడ్డి.. పీఠాధిపతుల దృష్టికి తీసుకొచ్చారు. చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వివరించారు. టీటీడీ ద్వారా గోరక్షణ కోసం విస్తృత చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలపై ఈవో జవహర్ రెడ్డిని స్వరూపానందేంద్ర స్వామి అభినందించారు.

Updated Date - 2021-09-11T23:35:58+05:30 IST