రహదారుల విస్తరణ.. భూసేకరణకు అనుమతి

ABN , First Publish Date - 2021-04-11T07:33:47+05:30 IST

తెలంగాణలోని రెండు జాతీయ రహదారులను విస్తరించడానికి ఆమోదం తెలుపుతూ.. కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది

రహదారుల విస్తరణ.. భూసేకరణకు అనుమతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రెండు జాతీయ రహదారులను విస్తరించడానికి ఆమోదం తెలుపుతూ.. కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇంకా నెంబరు కేటాయించని వరంగల్‌-ఖమ్మం రహదారిపై పరకాల దగ్గరలోని రోడ్డును విస్తరించడానికి 21.63 హెక్టార్ల భూసేకరణ చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 44ని విస్తరించడానికి వీలుగా భూసేకరణకు ఆమోదం తెలిపింది. తొండుపల్లి నుంచి కొత్తూర్‌ వరకు ఉన్న నాలుగు వరుసల రోడ్డును ఆరు వరుసలకు విస్తరించడానికి 11.24 హెక్టార్ల భూసేకరణకు అనుమతించింది. 

Updated Date - 2021-04-11T07:33:47+05:30 IST