ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2022-01-17T06:33:05+05:30 IST

కూలీనాలీచేసి కుటుం బానికి ఆసరాగా ఉన్న నిరుపేద ఇంటిపెద్ద మృతి తో కుటుంబం రోడ్డున పడింది.

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు

- ఇంటి పెద్దమృతితో రోడ్డునపడ్డ కుటుంబం

జగిత్యాలరూరల్‌, జనవరి 16: కూలీనాలీచేసి కుటుం బానికి ఆసరాగా ఉన్న నిరుపేద ఇంటిపెద్ద మృతి తో కుటుంబం రోడ్డున పడింది. జగిత్యాల రూరల్‌ మండలం వెల్దుర్ది గ్రామానికి చెందిన జిల్లా సురేష్‌ (48) గ్రామంలో చిన్న కోడిగుడ్లకొట్టు నడుపుతూ తమ కుటుంబాన్ని పోషించేవాడు. సురేష్‌ ఊపిరితిత్తుల వ్యాధితో భాధపడుతూ చికిత్సకు డబ్బులు లేకపోవడం తో పది రోజుల క్రితం మృతి చెందాడు. నిరుపేదలు కావడంతో సర్పంచ్‌ బుర్ర ప్రవీణ్‌ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, గ్రామప్రజలు అందరూ కలిసి 70 వేల రూపా యలు ఆర్థికసాయం చేశారు. దీంతో పాటు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అద్దె ఇంటివారు రానివ్వ కపోవడంతో సర్పంచ్‌, వార్డుసభ్యులు అన్నీతామై చూసు కుంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో గల ఒకపాతింటిలో ఉంచి చేదోడువాదోడుగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. సురేష్‌ భార్య విజయ, కుమారుడు శివసాయిలు మానసికవ్యాధితో భాదపడుతున్నా రు. కూతురు లావణ్య జగిత్యాల అర్బన్‌ మండలం లోని మోతెలో గల ప్రభుత్వపాఠశాలలో 10వ తరగ తి చదువుతోంది. ప్రస్తుతం వీరి కుటుంబ పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం, దాతలు స్పందిం చి నిరుపేద కుటుంబాన్ని ఆదుకో వాలని, మానవ తా దృక్పఽథంతో స్పందించి నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని వెల్దుర్ది గ్రామస్థులు కోరుతున్నారు. ఆర్థికసాయం చేయాల్సిన దాతలు జిల్లా విజయలక్ష్మీ గాయత్రి బ్యాంక్‌ ఖాతానంబర్‌ 201122010058067 (ఐఎప్‌సీకోడ్‌ టీఎస్‌ఏబీ 0020011) నంబర్‌లో డబ్బులు జమచేయాలని, ఫోన్‌ ద్వారా సంప్రదించే దాతలు 9949936224 నంబర్‌లో సంప్రదించి ఆదుకోవా లని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Updated Date - 2022-01-17T06:33:05+05:30 IST