తెలంగాణ ఉద్యోగులను ఏపీ నుంచి రప్పించండి
ABN , First Publish Date - 2021-01-18T08:03:54+05:30 IST
ఉద్యోగుల విభజన విషయంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు రప్పించాలని బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు.
ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్
హైదరాబాద్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల విభజన విషయంపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి, ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడకు రప్పించాలని బీసీ నేత ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో తెలంగాణ నేటివ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీ స్థానిక, జోనల్, మల్టీజోనల్, జిల్లా ఉద్యోగుల సమావేశం జరిగింది. ఉన్నతాధికారులు రూల్స్ అంటూ కాలాయాపన చేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించేందుకు ఏ రూల్స్ విరుద్ధంగా ఉన్నాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం పోరాడి, స్వరాష్ట్రం సాధించుకున్నాక మరో రాష్ట్రంలో ఉద్యోగం చేయాల్సి రావడం దురదృష్టకరమన్నారు.