21 వరకు చెన్నై-బిట్రగుంట Express Trains రద్దు
ABN , First Publish Date - 2022-01-19T17:27:45+05:30 IST
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చెన్నై సెంట్రల్-బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైళ్లు మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.17237 బిట్రగుంట-డా.ఎంజీఆర్ చెన్నై
పెరంబూర్(చెన్నై): కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చెన్నై సెంట్రల్-బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైళ్లు మంగళవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో, నెం.17237 బిట్రగుంట-డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్, నెం.17238 డా.ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-బిట్రగుంట ఎక్స్ప్రెస్ రైళ్లను శుక్రవారం వరకు రద్దుచేసినట్లు తెలిపింది.