కరోనా ఎఫెక్ట్: విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..!
ABN , First Publish Date - 2022-01-16T19:01:44+05:30 IST
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపునకు ప్రభుత్వం
హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపునకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 వరకు సెలవులు పొడిగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అధికారికంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సంక్రాంతి సెలవులు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ నెల 8 నుంచి నేటి వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో తరగతులను నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని విద్యాసంస్థలకు సర్కార్ ఆదేశించింది.