‘దేవినేని’ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-08T08:44:20+05:30 IST

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది

‘దేవినేని’ కేసులో మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సీఐడీ చేసిన అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. పిటిషనర్‌ విషయంలో అరె్‌స్టతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌.రఘునందనరావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఉమ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

Updated Date - 2021-05-08T08:44:20+05:30 IST