అదనపు కట్నం వేధింపుల కేసు

ABN , First Publish Date - 2021-05-11T05:21:11+05:30 IST

బేతంచెర్ల మండలంలోని సుజాత అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ బీవీ రమణ సోమవారం తెలిపారు.

అదనపు కట్నం వేధింపుల కేసు

బేతంచెర్ల, మే 10: బేతంచెర్ల మండలంలోని సుజాత అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ బీవీ రమణ సోమవారం తెలిపారు. సుజాతకు సిమెంట్‌నగర్‌కు చెందిన నిరంజన్‌తో  రెండేళ్ల క్రితం వివాహమైంది. రూ.6లక్షలు బంగారు ఆభరణాలు, రూ.6లక్షల నగదు కట్నం ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా  భర్త నిరంజన్‌, అత్త శాంతకుమారి, ఆడపడుచు సురేఖ   వేధిస్తునట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 


Updated Date - 2021-05-11T05:21:11+05:30 IST