దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి?

ABN , First Publish Date - 2021-12-11T03:06:19+05:30 IST

ఓ దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తోన్నట్లు

దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిడి?

గుంటూరు: ఓ దాడి కేసులో పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తోన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు సతమతమవుతున్నారు. మంగళగిరిలో ఇద్దరు యువకులపై ఓ గ్యాంగ్‌ దాడికి పాల్పడింది. రాడ్‌లు, కర్రలతో గ్యాంగ్ దాడి చేసింది. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేయవద్దని ఓ అధికార పార్టీ ఎంపీ నుంచి ఒత్తిడి వస్తోంది. కేసు పెట్టాలంటూ మరో అధికార పార్టీ నేత నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు.  




Updated Date - 2021-12-11T03:06:19+05:30 IST