నేత్రాలను దానం చేయాలి
ABN , First Publish Date - 2021-10-18T05:41:33+05:30 IST
ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మేర్గు భీష్మాచారి అన్నారు.
ఓదెల, అక్టోబరు17: ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మేర్గు భీష్మాచారి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నేత్రదాత శాతాళ్ల ఓదెమ్మ సంస్మరణ సభను ఫౌండే షన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా శరీర, అవయవ, నేత్ర దానంపై అవగాహన కల్పించారు. అనంతరం కుటుంబసభ్యులను సన్మానిం చారు. అలాగే గుండెపోటుతో మృతిచెందిన కానుగంటి రాజ్కుమార్ నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేయగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి తరలించారు. ఈకార్యక్రమంలో వైద్యులు వేణు, సంతోష్, వెంకటేశ్వర్లు, ఫౌండేషన్ సభ్యులు భువనగిరి రాజు, నిఖిల్, సతీష్, సారంగం, త్రివేది, శ్రావణ్కుమార్ పాల్గొన్నారు.