యువకుల మధ్య ఘర్షణకు దారితీసిన ఫేస్బుక్ సంభాషణ
ABN , First Publish Date - 2020-08-11T14:58:14+05:30 IST
ఫేస్ బుక్ సంభాషణ యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది.
ప్రకాశం జిల్లా: ఫేస్ బుక్ సంభాషణ యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఫేస్ బుక్ వేదికగా రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసుకున్న యువకులు.. ఒకరిపై ఒకరు బౌతిక దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు యువకులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, తిమ్మపాలెంలో ఈ ఘటన జరిగింది.