అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు: జంగం శ్వేత

ABN , First Publish Date - 2021-07-30T06:24:06+05:30 IST

బోనాల ఉత్సవాలకు ఐఎ్‌ససదన్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్‌ జంగం శ్వేత తెలిపారు.

అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు: జంగం శ్వేత
ఆలయ కమిటీ సభ్యులకు బోనాల చెక్కులు అందజేస్తున్న కార్పొరేటర్‌ జంగం శ్వేత

సైదాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవాలకు ఐఎ్‌ససదన్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్‌ జంగం శ్వేత తెలిపారు. గురువారం బోనాల చెక్కులను ఆలయ కమిటీ ప్రతినిధులకు ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మధుకర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర్‌రెడ్డి, కృష్ణ, మహేష్‌, ప్రదీప్‌ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

సదుపాయాలు కల్పించండి: కొప్పుల

మన్సూరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): బోనాల ఉత్సవాల నేపథ్యంలో మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని కాలనీలలో ఉన్న అన్ని ఆలయాల వద్ద సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డి గురువారం జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల వర్షాలకు రోడ్లు గుంతలు పడ్డాయని, వాటికి మరమ్మతులు చేపట్టి, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-30T06:24:06+05:30 IST