‘అత్యాచార బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం’
ABN , First Publish Date - 2021-06-22T06:18:25+05:30 IST
రామచంద్రపురం మం డలం మాలపాడు గ్రామనికి చెందిన అత్యాచార బాలికను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
రామచంద్రపురం, జూన్ 21: రామచంద్రపురం మం డలం మాలపాడు గ్రామనికి చెందిన అత్యాచార బాలికను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బి.సిద్ధు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు జి.సూరిబాబు, పీవైఎల్జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రాజు సోమవారం ఆర్డీవో సింధు సుబ్రహ్మణ్యాన్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆమె స్పందించి బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్ర మంలో నున్న చంద్రిక, నున్న కుమారి పాల్గొన్నారు.