యంత్రంలో నుంచి ఒక్కసారిగా మంటలు
ABN , First Publish Date - 2021-04-20T03:29:27+05:30 IST
కావలి రూరల్ మండలం నారాయణపురంలో సోమవారం వరి కోస్తున్న వరికోత యంత్రంలో cచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి వరికోత మిషన్ పూర్తిగా దగ్ధమైంది.
సుమారు రూ.11లక్షల ఆస్తి నష్టం
కావలి రూరల్, ఏప్రిల్ 19: కావలి రూరల్ మండలం నారాయణపురంలో సోమవారం వరి కోస్తున్న వరికోత యంత్రంలో cచి ఒక్కసారిగా మంటలు వ్యాపించి వరికోత మిషన్ పూర్తిగా దగ్ధమైంది. సిరిపురం గ్రామానికి చెందిన గంటా కోటేశ్వరరావుకు చెందిన వరికోత మిషన్ ద్వారా నారాయణపురంకు చెందిన మేకల శీనయ్య వరి పంట కోయసాగారు. పంట కోస్తుండగా షార్టుసర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో డ్రైవర్ చాకచక్యంతో కిందకు దూకేశాడు. వరికోత మిషన్కు నాలుగు వైపుల ఒక్కసారి మంటలు వ్యాపించటంతో పూర్తిగా దగ్ధమైంది. దీనితో సుమారు రూ.11 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు.