నకిలీ ఆడియోలతో పార్టీలో చిచ్చు

ABN , First Publish Date - 2021-12-04T16:02:26+05:30 IST

అన్నాడీఎంకే నేతలను తాను విమర్శిస్తున్నట్లు, అసమ్మతివర్గం నాయకురాలు శశికళకు మద్దతుగా మాట్లాడినట్లు నకిలీ ఆడియో ప్రసార మాధ్యమాల్లో వెలువడటం పట్ల మాజీ మంత్రి సెల్లూరు కే రాజు ఆగ్రహం

నకిలీ ఆడియోలతో పార్టీలో చిచ్చు

                   - మాజీ మంత్రి సెల్లూరు రాజు ఆగ్రహం


చెన్నై: అన్నాడీఎంకే నేతలను తాను విమర్శిస్తున్నట్లు, అసమ్మతివర్గం నాయకురాలు శశికళకు మద్దతుగా మాట్లాడినట్లు నకిలీ ఆడియో ప్రసార మాధ్యమాల్లో వెలువడటం పట్ల మాజీ మంత్రి సెల్లూరు కే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అన్నాడీఎంకేను కాపాడాలంటూ శశికళ నాయకత్వమే శరణ్యమంటూ తనగొంతును ఎవరో అనుకరించి ఆడియో విడుదల చేశారని తెలిపారు. అన్నాడీఎంకేలో ప్రజాస్వామ్యంగా సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని, పటిష్టమైన నాయకత్వంతో పార్టీ ముందుకు దూసుకెళ్లుతోందని ఆయన పేర్కొన్నారు. అన్నాడీఎంకే ఎదుగుదల చూసి ఓర్వలేకే దుష్టశక్తులు పార్టీలో చిచ్చుపెట్టేందుకు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.

Updated Date - 2021-12-04T16:02:26+05:30 IST