బ్రతికున్న వ్యక్తిని శ్మాసన వాటికకు తీసుకెళ్లినకుటుంబ సభ్యులు

ABN , First Publish Date - 2020-08-02T23:43:17+05:30 IST

బ్రతికున్న వ్యక్తిని శ్మాసన వాటికకు తీసుకెళ్లినకుటుంబ సభ్యులు

బ్రతికున్న వ్యక్తిని శ్మాసన వాటికకు తీసుకెళ్లినకుటుంబ సభ్యులు

ప్రకాశం: కందుకూరులో హృదయ విధారక సంఘటన చోటు చేసుకుంది. బ్రతికున్న వ్యక్తిని కుటుంబ సభ్యులు శ్మాసన వాటికకు తీసుకెళ్లారు. వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గుండెకు నెమ్ముతో పాటు పక్షవాతం రావడంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. రెండు రోజుల కంటే ఎక్కువ బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న భర్తను ప్రైవేటు అంబులెన్స్ లో తిరిగి తీసుకొచ్చి శ్మాసన వాటికలో సజీవంగా భార్య, కొడుకులు వదిలేశారు. సొంత ఇల్లు లేక ఆ కుటుబం అద్దె ఇంట్లో ఉంటోంది. కరోనా ఎఫెక్ట్ తో ఇంటి ఓనర్ రానివ్వడనే భయంతో బాధితుడిని శ్మసన వాటికకు తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీజేహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్ లేవంటూ అడ్మిషన్ ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-02T23:43:17+05:30 IST