శ్మశానంలో దాడి! సగం కాలిన కరోనా మృతదేహంతో పారిపోయిన బంధువులు

ABN , First Publish Date - 2020-06-03T01:50:43+05:30 IST

కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు స్థానికులు అడ్డుపడ్డి గొడవ చేయడంతో బంధులు సగం కాలిన మృత దేహాంతో పారిపోయారు.

శ్మశానంలో దాడి! సగం కాలిన కరోనా మృతదేహంతో పారిపోయిన బంధువులు

జమ్మూ: కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు స్థానికులు అడ్డుపడ్డి గొడవ చేయడంతో బంధువులు సగం కాలిన మృత దేహాంతో పారిపోయారు. ఈ దయనీయ ఘటన జమ్ముకశ్మీర్‌లో జరిగింది. దొడా జిల్లాకు చెందిన 72 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. దీంతో అతడి అంత్యక్రియలను ఇంటి వద్ద నిర్వహించేందుకు బంధువులు అధికారుల అనుమతి కోరారు. అయితే స్థానిక డొమన ప్రాంతంలోనే కర్మకాండలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పడంతో బంధువులు అంగీకరించారు.


ఓ రెవిన్యూ అధికారి, ఇద్దరు పోలీసులు వెంటరాగా..వారు మృత దేహాన్ని స్థానికంగా ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ చితికి నిప్పంటించారు. ఆ తరువాత కొద్ది సేపటికే స్థానికులు గుంపులుగా వచ్చి అక్కడ కర్మకాండ నిర్వహించరాదంటూ మృతుడి ఇద్దరు కుమారులు, భార్యతో గొడవకు దిగారు. వారిపై రాళ్లతో, కర్రలతో దాడికి కూడా దిగారని సమాచారం. దీంతో భయపడిపోయిన బంధువులు సగం కాలిన మృత దేహంతో అక్కడి నుంచి పారిపోయి ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆ తరువాత అధికారుల సహాయంతో మరో శ్మశానవాటికలో దహనకార్యక్రమాలను పూర్తి చేశారు.


కాగా.. ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి దిగుతున్న గుంపు నుంచి తమను అంబులెన్స్ డ్రైవర్ కాపాడని చెప్పారు. తమ వెంట వచ్చిన ఇద్దరు పోలీసులు స్థానికులను అదుపు చేయలేకపోయారని, రెవెన్యూ అధికారి కూడా అక్కడ కనిపించలేదని తెలిపారు.

Updated Date - 2020-06-03T01:50:43+05:30 IST