నేను బతికే ఉన్నా! : వీజీపీ రాతి మనిషి
ABN , First Publish Date - 2020-09-24T13:54:02+05:30 IST
చెన్నై శివారు ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతం వీజీపీ గోల్డెన్ బీచ్ వద్ద పనిచేసే రాతి మనిషి
చెన్నై : చెన్నై శివారు ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతం వీజీపీ గోల్డెన్ బీచ్ వద్ద పనిచేసే రాతి మనిషి తాను బ్రతికే ఉన్నానంటూ స్పష్టంచేశారు. ఆ పర్యాటక ప్రాంతం ప్రవేశ ద్వారం వద్ద రాజుల కాలంనాటి భటుడి దుస్తుల్లో చేత దండంతో రాయిలా నిలబడి ఉండే వ్యక్తిని చూడటానికి సందర్శకులు పోటీపడేవారు. చిన్నారులు ఆ రాతి మనిషిని చేతితో తాకటం, ఆయన హఠాత్తుగా వారిని బెదిరించటం జరుగుతుండేది. ఈ నేపథ్యంలో ఆ రాతి మనిషి కరోనా సోకి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆయనే స్వయంగా తాను బతికే ఉన్నానని, కోవిడ్ సంక్షోభం ముగిసి గోల్డెన్ బీచ్ తెరిచాక ప్రజల ముందుకు వస్తానని వీడియో సందేశంలో వెల్లడించారు.