తిరుపతి విమానాశ్రయంలో బుగ్గనకు వీడ్కోలు
ABN , First Publish Date - 2021-06-19T05:51:44+05:30 IST
చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
రేణిగుంట, జూన్ 18: రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రెండురోజుల తిరుపతి, తిరుమల పర్యటనకు వచ్చిన విషయం విదితమే. శుక్రవారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యులతో కలసి తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు విమానంలో బయల్దేరి వెళ్లారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ ఆఫీసర్ సిరాజుద్దీన్, ఈటీసీ రవికుమార్, తహసీల్దార్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.