ప్రకృతి వనంలో భూమి పోతుందని రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-25T02:19:44+05:30 IST

తన భూమని ప్రకృతి వనానికి తీసుకుంటారనే భయంతో జిల్లాలో ఓ రైతు

ప్రకృతి వనంలో భూమి పోతుందని రైతు ఆత్మహత్య

నారాయణపేట: తన భూమని ప్రకృతి వనానికి తీసుకుంటారనే భయంతో జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణపేట మండలంలోని శేర్నపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లప్ప(55)పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 15సం. ల క్రితం జాజపూర్ శివారులో అసైన్డ్ భూమి కొన్నాడు. అయితే పల్లె ప్రకృతి వనంలో తాను కొన్న భూమి పోతుందనే మనస్తాపంతో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతు ఆత్మహత్యతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Updated Date - 2021-08-25T02:19:44+05:30 IST