రైతు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-08-03T17:55:01+05:30 IST

రైతు సంక్షేమానికి..

రైతు అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సబ్బవరానికి సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మంజూరైందన్నారు. ఇక నుంచి ప్రతి నెలలో మూడవ శుక్రవారం జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కన్నబాబు, చెట్టి ఫాల్గుణ, కె.భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, పి.గణబాబు, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి, జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ చిక్కాల రామారావు, వ్యవసాయ శాఖ జేడీ లీలావతి, ఇతర అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-03T17:55:01+05:30 IST