విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2021-02-25T04:43:59+05:30 IST
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామా రెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామంలో చోటు చేసు కుంది.
రామారెడ్డి, ఫిబ్రవరి 24: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామా రెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామంలో చోటు చేసు కుంది. ఎస్సై భువనేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. రేకులపల్లి మహిపాల్రెడ్డి (43) పొలంలోని విద్యుత్ బో రు చెడిపోయింది. దానిని పైకి తీసి రీపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. స్పృహ కోల్పోవడంతో కింద పడి పోయాడు. కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య యశోద, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.