రైతుల సంక్షేమానికే రైతు వేదికలు
ABN , First Publish Date - 2020-08-14T10:55:51+05:30 IST
రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తోందని ఎమ్మెల్యే పట్నంనరేందర్రెడ్డి అన్నారు.
కొడంగల్ ఎమ్మెల్యే పట్నంనరేందర్రెడ్డి
దౌల్తాబాద్/కొడంగల్: రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలను ప్రభుత్వం నిర్మిస్తోందని ఎమ్మెల్యే పట్నంనరేందర్రెడ్డి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండలంలోని దేవరఫస్లాబాద్, దౌల్తాబాద్ గ్రామాల్లో రైతు వేదికభవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆయా గ్రామాల రేషన్ డీలర్లకు చెక్కులు అందించారు.
హనుమాన్ ఆలయం దగ్గర వీధి లైట్లను ప్రారంభించి మండల కేంద్రంలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, జడ్పీటీసీ మహిపాల్, సర్పంచ్లు మల్లీశ్వరమ్మ, శిరీష, తహసీల్దార్ వెంకటేశ్, ఎంపీడీవో తిరుమలస్వామి, ఎంపీఓ రవీందర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనుల పరిశీలన
కొడంగల్ పట్టణంలోని సన్సిటీ కాలనీలో నిర్మిస్తున్న క్యాంపు కార్యాలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల్లో నాణ్యతను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
కొడంగల్లోని కార్గీల్కాలనీలో జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.