విద్యుదాఘాతంతో రైతు మృతి

ABN , First Publish Date - 2020-02-23T07:14:29+05:30 IST

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో వి ద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన శనివారం గాంధారిలో

విద్యుదాఘాతంతో రైతు మృతి

గాంధారి, ఫిబ్రవరి22: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో వి ద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన సంఘటన శనివారం గాంధారిలో చో టు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గాంధారి మండల కేంద్రానికి చెందిన కుమ్మరి శంకర్‌ (45) ఉదయం 5 గం టలకు తాను సాగు చేస్తున్న పంటకు నీళ్లు పెడుదామని చేనులోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగలడ ంతో పంట చేనులోనే కుప్పకూలి పో యాడు. ఎంత సేపటికి శంకర్‌ ఇంటి కి రాకపోవడంతో అతని పెద్దకుమా రుడు పంటచేనులోకి వెళ్లి చూడగా శంకర్‌ వీగతజీవుడిగా పడి ఉన్నాడు. 


దీంతో కుటుంబ సభ్యులకు స్థాని క పోలీసులకు సమాచారం అందించడంతో సదాశివనగర్‌ ఎస్సై నరేష్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించారు. గాంధారి రె వెన్యూ అధికారులు, పోలీసులు పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.  శంకర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు పోలీసులు పేర్కొన్నారు. శంకర్‌ అందరితో కలిసి మెలసి ఉం డే వాడని ఆయన మృతితో కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని గ్రామ స్థులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

Updated Date - 2020-02-23T07:14:29+05:30 IST