పిడుగుపాటుకు రైతు మృతి

ABN , First Publish Date - 2021-09-02T00:44:29+05:30 IST

పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

పిడుగుపాటుకు రైతు మృతి

ములుగు: పిడుగుపాటుకు రైతు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మంగపేటకు చెందిన నర్సింహసాగర్‌కు చెందిన కాడబోయిన వీరయ్య(75) రోజు మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం పూరేడుపల్లి శివారులోని తన పొలం వద్దకు వెళ్లాడు. ఇంతలోనే ఉరుములతో వర్షం మొదలవడంతో తలదాచుకు నేందుకు పొలం దాటుతుండగా పిడుగు పాటుకు గురయ్యాడు.  కొద్ది దూరంలోనే ఉన్న ఇతర రైతులు దగ్గరికి వచ్చి చూడగా అప్పటికే వీరయ్య మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.   

Updated Date - 2021-09-02T00:44:29+05:30 IST