నెలాఖరులోగా రైతు వేదికలు పూర్తి కావాలి
ABN , First Publish Date - 2020-08-11T11:20:20+05:30 IST
జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
టెలీకాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీశ్రావు ఆదేశాలు
సంగారెడ్డి టౌన్, ఆగస్టు 10: జిల్లాలో నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి సోమవారం కలెక్టర్ హన్మంతరావు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 116 రైతు వేదికల నిర్మాణ పనులను పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తికానట్టయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. పనుల్లో జాప్యం చేసే ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు.