వైసీపీ నేతల నిర్వాకంతో నా పొలం కోతకు గురైంది.. ఓ రైతు ఆవేదన

ABN , First Publish Date - 2021-10-05T18:14:35+05:30 IST

ప్రత్యర్థులే టార్గెట్‌గా వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.

వైసీపీ నేతల నిర్వాకంతో నా పొలం కోతకు గురైంది.. ఓ రైతు ఆవేదన

అనంతపురం జిల్లా: ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రత్యర్థులే టార్గెట్‌గా వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురంలో మరో ఘటన చోటు చేసుకుంది. మంత్రి శంకరనారాయణ అనుచరులు జేసీబీలతో కాలువలు తీసి నీటిని మళ్లించారని, దీంతో తన పొలమంతా కోతకు గురైనట్లు బాధితుడు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలు నానాటికి పెరిగిపోతున్నాయని బాధిత రైతు సెల్పీ వీడియోలో తెలిపారు.


హిందూపురం మండలం, రాజపల్లి గ్రామానికి చెందిన వేమారెడ్డి అనే రైతుకు ఐదెకరాల పొలం ఉంది. ఒక ఎకరం హంద్రీనీవా కాలువ కోసం భూమి తీసుకున్నారు. అయితే ఇంత వరకు భూ పరిహారం అధికారులు చెల్లించలేదని రైతు తెలిపారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-05T18:14:35+05:30 IST