రైతు వేదిక పనులను త్వరగా పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-08-03T10:33:53+05:30 IST

మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ డీఈ గిరీష్‌బాబు పేర్కొన్నారు.

రైతు వేదిక పనులను త్వరగా పూర్తి చేయాలి

వేమనపల్లి, ఆగస్టు 2 : మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ డీఈ గిరీష్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం  వేమనపల్లి మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతు వేదికల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, రైతు వేదికలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. ఆయన వెంట ఏఈ శ్రీధర్‌, సర్పంచు కుబిడె మధుకర్‌, మాజీ సర్పంచు, సివిల్‌ కాంట్రాక్టర్‌ లక్ష్మీనారాయణ ఉన్నారు.

Updated Date - 2020-08-03T10:33:53+05:30 IST