మిడతలపై డీజే దాడి.. ఓ రైతు వింత తెలివి!

ABN , First Publish Date - 2020-05-28T03:23:41+05:30 IST

ఇటీవలికాలంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పంట పొలాలపై మిడతల దాడులు ఎక్కువయ్యాయి.

మిడతలపై డీజే దాడి.. ఓ రైతు వింత తెలివి!

లక్నో: ఇటీవలికాలంలో ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పంట పొలాలపై మిడతల దాడులు ఎక్కువయ్యాయి. ఈ దాడులతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఈ మిడతల ధాటిని తట్టుకునేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు వింత ఉపాయం ఆలోచించాడు. పెళ్లిళ్ల సమయంలో ఉపయోగించే డీజే స్పీకర్ల బండిని తన పొలంలో తిప్పసాగాడు. దీని నుంచి వచ్చే శబ్దానికి మిడతలు పారిపోతాయని ఆ రైతు యోచన. దీనికి సంబంధించిన వీడియోను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘డీజేలు కేవలం పాటలు పాడటానికి, డ్యాన్సులు వేయడానికే కాదు. ఇలా మిడతలను భయపెట్టడానికి కూడా ఉపయోగపడతాయి’ అంటూ ట్వీట్ చేశాడు.



Updated Date - 2020-05-28T03:23:41+05:30 IST