రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2021-12-08T04:37:41+05:30 IST

రైతు సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌

వెల్దండ, డిసెంబరు 7 : రైతు సంక్షేమానికి పాటుపడుతున్న  ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని  కుప్పగండ్ల, బొల్లంపల్లి గ్రామాల్లో  సింగిల్‌విండో ఆధ్వర్యంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రైతన్నలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీ సుకొచ్చి, మద్దతుధర పొందాలని జైపాల్‌యాదవ్‌ సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ భాస్కర్‌రావు, ఎంపీపీ విజయ, వైఎస్‌ఎంపీపీ శాంతి, సర్పంచులు శారదమ్మ, అపర్ణ, ఎంపీటీసీ చక్రవర్తిగౌడ్‌, రైతుసమన్వయసమితి చైర్మన్‌ భాస్కర్‌రావు, ఏవో మంజుల, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ శేఖర్‌, ఆచారి మిత్రమండలి అధ్యక్షుడు పరమేష్‌గౌడ్‌, నాయకులు రవిగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:37:41+05:30 IST