కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం

ABN , First Publish Date - 2022-07-02T04:12:10+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుం దని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం ధర్మారావుపేటలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు.

కాంగ్రెస్‌తోనే రైతు సంక్షేమం
ధర్మారావుపేట రచ్చబండలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

కాసిపేట, జూలై 1: కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం సాధ్యమవుతుం దని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. శుక్రవారం ధర్మారావుపేటలో నిర్వహించిన రచ్చబండలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. రాహుల్‌గాంధీ వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను నాయకులు, కార్యకర్తలు రైతుల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకుడు జంగిలి రమేష్‌తోపాటు 50 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పారు. పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ, నాయకులు తిరుపతి, ఎంపీటీసీలు మల్లేష్‌, మడావి భీంరావు పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-02T04:12:10+05:30 IST