ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల రాస్తారోకో

ABN , First Publish Date - 2020-06-01T10:26:36+05:30 IST

మండలంలోని ఖానాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో వరిధా న్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కో రుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల రాస్తారోకో

మంథనిరూరల్‌, మే 31: మండలంలోని ఖానాపూర్‌లోని కొనుగోలు కేంద్రంలో వరిధా న్యం కొనుగోళ్ళను వేగవంతం చేయాలని కో రుతూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆదివారం ఉదయం మంథని-కాటారం ప్రధాన రహదారిపై ఎక్లాస్‌పూర్‌ వద్ద వరి ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నా రు. తరుగు పేరిట రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతుల ఆందోళన వద్దకు ఎస్‌ఐ ఓంకార్‌ యాదవ్‌ చేరుకొని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి రైతులను శాంతింప చేశారు. చాలా సేపు రాస్తారోకోతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 

Updated Date - 2020-06-01T10:26:36+05:30 IST