11 మంది అమరావతి రైతులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-10-25T16:19:06+05:30 IST

రాజధాని పరిధి గ్రామమైన కృష్ణాయపాలెం కు చెందిన 11 మంది రైతులపై మంగలగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మూడు రాజధానులు, 30 లక్షల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని రాజధానిలో దీక్ష

11 మంది అమరావతి రైతులపై కేసు నమోదు

అమరావతి: రాజధాని పరిధి గ్రామమైన కృష్ణాయపాలెం కు చెందిన 11 మంది రైతులపై మంగలగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 11 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మూడు రాజధానులు, 30 లక్షల ఇళ్ల స్థలాలను అడ్డుకుంటున్నారని రాజధానిలో దీక్ష చేపట్టేందుకు ఆటోలలో వస్తున్న వ్యక్తులను సదరు రైతులు కృష్ణాయపాలెం వద్ద ఆపేశారు. ఎక్కడి నుండి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అని వారిని రైతులు నిలదీశారు. బయటి ఊరి వాళ్లకు రాజధాని గ్రామాల్లో పని ఏంటని ప్రశ్నించారు. దీంతో వారు రైతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మంది రైతులపై కేసులు నమోదు చేశారు.

Updated Date - 2020-10-25T16:19:06+05:30 IST