గుంటూరు జిల్లాలో రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-29T17:31:20+05:30 IST

గుంటూరు జిల్లాలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. చేబ్రోలు మండలం మంచాల రైతు భరోసా కేంద్రం వద్ద రైతుల నిరసన తెలిపారు.

గుంటూరు జిల్లాలో రైతుల ఆందోళన

గుంటూరు: గుంటూరు జిల్లాలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. చేబ్రోలు మండలం మంచాల రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసన తెలిపారు. రోడ్డుపై ధాన్యం పోసి ధర్నాకు దిగారు. పండించిన ధాన్యం అంతా ప్రభుత్వం కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.  ప్రభుత్వం ఇప్పటికైనా రైతు సమస్యలను పరిష్కరించాలని ధూళిపాళ్ల నరేంద్ర కోరారు. 

Updated Date - 2021-12-29T17:31:20+05:30 IST