రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి
ABN , First Publish Date - 2021-06-16T05:27:24+05:30 IST
రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని రాజమహేంద్రవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కె.సావిత్రి అన్నారు. పలుచోట్ల కౌలు రైతులకు అవగాహన సదస్సులు మంగళవారం నిర్వహించారు.
- వ్యవసాయశాఖ రాజమహేంద్రవరం ఏడీ సావిత్రి
- కౌలు రైతులకు అవగాహన సదస్సులు
రాజమహేంద్రవరం రూరల్, జూన్ 15: రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలని రాజమహేంద్రవరం వ్యవసాయ సహాయ సంచాలకులు కె.సావిత్రి అన్నారు. పలుచోట్ల కౌలు రైతులకు అవగాహన సదస్సులు మంగళవారం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు సొసైటీ ఆవరణలో జరిగిన సదస్సులో ఏడీఏ సావిత్రి మాట్లాడుతూ రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని చేపట్టాలన్నారు. రైతుభరోసాకేంద్రంలో నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలును రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కె.శ్రీనివాస్, సొసైటీ త్రిసభ్యకమిటీ సభ్యుడు పిన్నమరెడ్డి సూర్యచంద్రరావు, ఏఈవోలు పీటర్, వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.