రైతులు ఇబ్బందులు పడొద్దు
ABN , First Publish Date - 2021-06-19T05:55:10+05:30 IST
ఈ ఏడాది చెరకు రైతులు ఇబ్బందులు పడకూడదని ట్రైడెంట్ కర్మాగారం యాజమాన్యాన్ని ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు ఆదేశించారు
నవంబరు 15 నుంచి క్రషింగ్ ప్రారంభించాలి
బిల్లుల చెల్లింపులో జాప్యం తగదు
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్, జూన్ 18: ఈ ఏడాది చెరకు రైతులు ఇబ్బందులు పడకూడదని ట్రైడెంట్ కర్మాగారం యాజమాన్యాన్ని ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు ఆదేశించారు. హైదరాబాద్లోని ఎంపీ బీబీపాటిల్ కార్యాలయంలో శుక్రవారం ట్రైడెంట్ చక్కెర కర్మాగారం యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడారు. గతంలో మాదిరి ఈ ఏడాది రైతులను ఇబ్బందులకు గురిచేయకూడదని సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కర్మాగార యాజమాన్య అధికారులను వారు కోరారు. నవంబర్ 15లోగా క్రషింగ్ మొదలుపెట్టాలని యాజామాన్యానికి సూచించారు. మార్కెట్ ధరలను దృష్టిలో ఉంచుకుని రైతులకు మద్దతు ధరను ఇవ్వాలని చెప్పారు. కర్మాగారంలోని కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు అందజేసి తిరిగి పనుల్లోకి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ షుగర్ కేన్ కమిషనర్ రాఘవేంద్రరావు, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, ట్రైడెంట్ షుగర్స్ ఎండీ రామ్నాథ్రావు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, చక్కెరశాఖ అధికారి రవీందర్రావు పాల్గొన్నారు.